మన్యం న్యూస్, పినపాక, జనవరి 17
ములుగు జిల్లా, నరసింహసాగర్ దళితుల పై జరిగిన దాడిని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. దళితులపై దాడులు జరగకుండా దాడి చేసిన వారిపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. దళితులపై అనైతిక దాడులు జరిగితే ఎస్సీ సంఘాలు ఏకమై ఉద్యమించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుదిగొండ రామకృష్ణ, దాసరి రవికుమార్, లాయర్ రత్నం, మండల నాయకులు చీకటి రఘు, నక్క ప్రశాంత్, నల్ల నరేష్ , నల్ల సాంబ, డివిజన్ నాయకులు కోడి రెక్కలరామకృష్ణ, శనగ మల్లేష్, పిల్లి లాలయ్య, మణుగూరు టౌన్ నాయకులు కమటం రవీందర్, గంట మధు, ముల్క నరేష్ తదితరులు పాల్గొన్నారు