మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 17.. మన్యం మనుగడ అంటే నవ్వుకున్నారు.. నేడు మన్యం న్యూస్ అంటే ఏంటో తెలియదు అన్నారు.. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రధాన పత్రికలకు దీటుగా సంచలనమైన కథనాలను ప్రచురితం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో మన్యం న్యూస్ సభ్యుల కృషి అభినందనీయమని స్వయంగా మన్యం బిడ్డ పినపాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్పష్టం చేయడం విశేషం. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో ఓ రెస్టారెంట్లో మన్యం న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మనోభావాలను పంచుకున్నారు. మన్యం న్యూస్ ఐడి కార్డును తన గుండెలకు అద్దుకొని సగర్వంగా అందరికీ స్వాగత సుమాంజనులు తెలియజేయడం విశేషం.. మన్యం న్యూస్ సభ్యులుగా కొనసాగుతున్న సీఈఓ కంది రామచంద్ర రెడ్డి, ఆర్ ఎం దామోదర్ గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సీమకుర్తి రామకృష్ణ, తోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతంగా పనిచేస్తున్న మన్యం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అని తెలిపారు. రానున్న రోజుల్లో మన్యం న్యూస్ మరింత వేగవంతమై అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని ఆకాంక్షించారు.
