UPDATES  

 వైభవంగా బొమ్మల కొలువు….

మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 17: సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా ఇల్లందు క్లబ్ లో లేడీస్ క్లబ్ ఆద్వర్యంలో మంగళవారం బొమ్మల కొలువు కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా ఇల్లందు క్లబ్ ఆవరణం అంతా పచ్చని తోరణాలతో, ఆకర్షణీయమైన రంగవల్లులతో, విద్యుత్ దీపాల అలంకరణతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా మణుగూరు ఏరియా సేవ అద్యక్షురాలు సునీత వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు. లేడీస్ క్లబ్ సభ్యులు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలలో భాగంగా బొమ్మల కొలువును ఎంతో చక్కగా తీర్చిదిద్దడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారన్నారు. అనంతరం గౌరవ అతిధి హరిణి మాట్లాడుతూ దేశంలోనే ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న బొమ్మల కొలువు లాంటి వేడుకలను, అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను ఆచరిస్తూ వాటిని ముందు తరాల వారికి పరిచయం చేయడంలో మహిళలలే ముఖ్య భూమిక పోషిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. ఈ సందర్భంగా మహిళలకు, యువతులకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మణుగూరు జీఎం వెంకటేశ్వరరెడ్డి కొత్తగూడెం సేవ అధ్యక్షురాలు జక్కం వాణి, ఇల్లందు ఏరియా సేవ అధ్యక్షురాలుమధురవాణి, సువర్ణా, అనిత ప్రసన్న, స్వర్ణలత, నళిని, ఆఫ్రోజ్ , అపర్ణ, నాగలక్ష్మి, నాగేశ్వర రావు, లలిత్ కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస చారి, నర్సిరెడ్డి, వీరభద్రుడు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !