మన్యం న్యూస్ ,
వెంకటాపురం(నూగూరు)
జనవరి 17:
మండల మున్నూరు కాపు కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వెంకటాపురం మండల కేంద్రంలో భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు ధనపనేని వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగావెంకటాపురం పట్టణ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వెంకటాపురం పట్టణ అధ్యక్షుడిగా పడాలరమేష్, ప్రధాన కార్యదర్శి గా బాసాని రమేష్, ఉపాధ్యక్షులు గా తాటి శ్రీనివాస్,జాపతి వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ లు గా , పటేల్ నాగరాజు, కొడేల జగదీష్, సెక్రటరీ లు గా కాళేశ్వరపు యతీష్, ఆకుల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లు గా రాపోలు శ్రీను,కూసం నాగరాజు, కోశాధికారి గా జల్లిగంపల లక్ష్మిపతి, కార్యవర్గ సభ్యులు రాగం మల్లిఖార్జున రావు,రాపల్లి సురేష్, పుప్పాల శ్రీనివాస్, రాగం సంతోష్,బత్తుల నరేష్ లను ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ పట్టణ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.సమన్వయం, సంఘటితం,ఐక్యత గా ఉండి మున్నూరు కాపుల సమస్య లకు పాటుపడతామని అన్నారు. మండల అధ్యక్షుడు జక్కుల శ్యాం, ప్రధాన కార్యదర్శి దాసరి నారాయణరావు, ఉపాధ్యక్షుడు రంగయ్యనాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లు శేరురాంబాబు,అడపా సాంబం,గౌరవ సలహాదారులు కూసంసాంబశివరావు,బెజ్జని సత్యనారాయణ, సీనియర్ నాయకుడు జల్లిగంపల కళాధర్, కార్యవర్గ సభ్యుడు పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
