-మన్యం న్యూస్ బూర్గంపహాడ్ జనవరి 17: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో స్థానిక యూత్ ఆధ్వర్యంలో మిత్రుని జ్ఞాపకార్థంగా నిర్వహిస్తునటువంటి రెండవ సతీష్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా బూర్గంపహాడ్ బబ్బు ఎలెవన్ జట్టు విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బూర్గంపహాడ్ బబ్బు ఎలెవన్- ఎస్ఆర్పి ఎలెవన్ జట్లు తలపడ్డాయి.టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన బబ్బు ఎలెవన్ జట్టు 11.1 ఓవర్ల లో 65 పరుగులు చేసి అలౌట్ అయింది.అనంతరం 66 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్పి ఎలెవన్ జట్టు నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసి ఓటమి పాలైంది.బూర్గంపహాడ్ బబ్బు ఎలెవన్ జట్టులో 4 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన కార్తిక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత గారు రూ.18,000 నగదుతో పాటు విజేతగా నిలిచిన బూర్గంపహాడ్ బబ్బు ఎలెవన్ జట్టుకు విన్నర్స్ ట్రోఫీని ద్వితీయ స్థానంలో నిలిచిన ఎస్ఆర్పి ఎలెవన్ జట్టుకు రూ.12,000 నగదుతో పాటు రన్నర్స్ గా నిలిచిన జట్టుకు రన్నర్స్ ట్రోఫీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఆవుల నాగార్జున రెడ్డి,పాలం దివాకర్ రెడ్డి,బాదం గణేష్ రెడ్డి,యారం పున్నారెడ్డి,దుగ్గు శ్రీనివాస రెడ్డి,దుగ్గు రాజశేఖర్ రెడ్డి,ఉమ్మలరెడ్డి బాలశేకర్ రెడ్డి,చాగర్లమూడి జగదీష్,పేరం సంజీవ రెడ్డి,పోతిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,యారం పూర్ణ చందర్ రెడ్డి,లోకిరెడ్డి వెంకటస్వాతిక్ రెడ్డి పడిదెల శ్రీను,బందెల శ్రీను,పాలం ప్రకాష్ రెడ్డి,బాదం రామకృష్ణ రెడ్డి,చింతా వెంకట్రామిరెడ్డి,బిజ్జం అంజిరెడ్డి,పాశం వెంకట్రామిరెడ్డి,బాదం వెంకటేశ్వర రెడ్డి,పోతిరెడ్డి తిరుపతి రెడ్డి,ఆలేటి వెంకటేష్,మడకం గణేష్,జక్క కార్తిక్,బందెల సాయి పవన్, కటుకురి విక్రమ్ ,బొడ్డు అంజిరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
