మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిదిలోని చిరుమళ్ళ గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే, జెడ్పిచైర్మన్ చందా లింగయ్య దొర తెలిపారు.మంగళవారం చిరుమళ్ళ గ్రామంలోని సమ్మక్క- సారక్క గుడి ఆవరణలో గోడ పత్రికలు విడుదల చేశారు.అనంతరం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ జనవరి 31 మంగళవారం సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రారంభమవుతుందని
ఫిబ్రవరి ఒకటో తేదీ బుధవారం రాత్రి పది గంటలకు దేవత మూర్తులు సారలమ్మ గుడికి వస్తారని, రెండవ తేదీ గురువారం నిండు జాతర వనదేవత,తల్లి దేవత గుడికి వచ్చునని ఫిబ్రవరి 4 వ తేదీ శనివారం దేవత గుడి నుంచి (వన ప్రవేశం) జరుగుతుందని తెలిపారు.ఈ జాతర లో ప్రత్యేకించి గత నాలుగు సంవత్సరాలుగా 21 రోజులపాటు సమ్మక్క దీక్ష దారణ చేయడం జరుగుతుందని, కనుమరుగైపోతున్న ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం ఆదివాసి సాంస్కృతిక పోరాటంలో భాగంగా ప్రతి ఒక్కరూ కదం తొక్కి ముందుకురావాలి అని ఆయన అన్నారు.సమ్మక్క సారక్క జాతర ఉత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు తెలియజేశారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు.ఈ జాతర ఏర్పాట్లను ఆదివాసి తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ మార్గదర్శనం చేస్తున్నారని కనుమరుగైపోతున్న ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం ఆదివాసి సాంస్కృతిక పోరాటంలో భాగంగా ఈ జాతరలో సుమారు 50 ఇలవేల్పులు వివిధ ఇంటిపేర్ల ఇలవేల్పులన్నీ కూడా ఇక్కడకు చేరుకుంటాయని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో సమ్మక్క సారలమ్మ ఉత్సవ కమిటీ ఆలయ ధర్మకర్తలు చందా బిక్షపతి,చందా భూపతయ్య,వీరయ్య, గోవర్థన్ పాల్గొని జాతర నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
