పెద్ద సార్ సభకు సైకిల్ సవారి
ఉద్యమ నాయకుడు .. సీఎం కేసీఆర్
జన చైతన్య యాత్ర విజయవంతం చేస్తాం
– బిఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలుకుతున్నాం.. కూకటి ప్రసాద్
మన్యం న్యూస్, సారపాక .. జనవరి 17..ఖమ్మం జిల్లా కేంద్రంగా నేడు నిర్వహించనున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని నినాదంతో తెలంగాణ ఉద్యమ నాయకులు కూకటి ప్రకాష్ అనే అతను సైకిల్ మీద ఖమ్మం వరకు జన చైతన్య సైకిల్ యాత్ర చేస్తున్నారు. మంగళవారం ఈ జనచైతన్య సైకిల్ యాత్రలో భాగంగా కూకటి ప్రకాష్ సారపాక చేరుకున్నారు. ఆయనకు సారపాక టౌన్ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బూర్గంపహడ్ సొసైటీ ఛైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బూర్గంపహడ్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగ జగదీష్, సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్, పినపాక నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచంద్రరావు, సారపాక టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, సారపాక టౌన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసుబు, మూడ్ మణి, భూక్య కిషోర్, మోహన్ రావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు