మన్యం న్యూస్, మంగపేట.
మండలం లోని పలు గ్రామాల్లో గుడుంబా అమ్మకాలు విపరీతంగా జరుగుతుంది. గుడుంబా అమ్మకాలు ముఖ్యంగా పేదవారిని టార్గెట్ గా చేసుకొని సాగిస్తున్నారు.ప్రతి ఒక్క పేదలు నివసించే వాడకు కనీసం మూడు, నాలుగు గుడుంబా విక్రయ కేంద్రాలు ఉంటున్నాయి. పొద్దంతా పని చేసి అలసి పోయిన ప్రజలు గుడుంబా కు బానిసలుగా మారుతున్నారు.యువకులు కూడా కొంతమంది గుడుంబాకు బానిసలుగా మారారు. మండలం లో వైన్ షాప్ లు లేకపోవడం, బెల్ట్ షాపుల్లో మద్యం ధర ధర ఎక్కువ గా ఉండటం తో, ప్రజలు గుడుంబా ధర తక్కువగా ఉండటం వలన చాలామంది గుడుంబాను ఆశ్రయిస్తున్నారు. గుడుంబా తయారీ లో హానికరం రసాయనాలు వాడుతున్నారు, దానితో త్రాగిన వారికీ విపరీతంగా మత్తులో, త్రాగి ఊగుతున్నారు. త్రాగక పోతే తల తిరిగి, మరల, మరల త్రాగుతూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి హానికరం గుడుంబా విక్రయాలను అరికట్టి,గుడుంబా తయారీదారులను, విక్రయ దారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
