మన్యం న్యూస్, మంగపేట.
మండలం లో మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా నూతనంగ నిర్మిస్తున్న భవనాలు నాణ్యత లోపంతో నిర్మిస్తున్న కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సమావేశం సయ్యద్ షఫీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి మాట్లాడుతు మంగపేట మండల వ్యాప్తంగా మన ఊరు మన బడి పాఠశాలలో . పునాదులు బలంగా నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో రెండో ప్లోర్ నిర్మించే అవకాశం ఉన్న నాణ్యత లోపం వలన క్రుంగి పోయే అవకాశం ఉంటుంది. అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్కు అయి నాణ్యత లేకుండా ఇస్టానుసారంగా నిర్మిస్తున్నారని, సంబందిత అధికారులను సంప్రదించగా పునాదులు నాణ్యత వుండాలి, నాణ్యత విషయం లో ఏ మాత్రం అవకతవకలు ఉన్న తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.గ్రామాలలో జరుగుతున్న పనికి నాణ్యతలో చాల తేడా ఉందని, సంబందిత అధికారులు వెంటనే స్పందించి నాణ్యతతో మన ఊరు మన బడి నాణ్యత నిర్మాణం పనులు జరిగే విదంగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దశల వారి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వి, సిద్దు, హేమంత్,సాగర్,వెంకట్, ఈశ్వర్,ముకేష్ తదితరులు పాల్గొన్నారు.