UPDATES  

 గ్రామీణ యువత క్రీడా రంగంలో రాణించాలి. జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి.

మన్యం న్యూస్, మంగపేట.
గ్రామీణ యువత క్రీడారంగంలో బాగా రాణించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. మంగళ వారం ఆయన మండలంలోని అకినేపెల్లి మల్లారం ఎస్టి కాలనీలో యూత్ సభ్యులకు రూ 2000 విలువైన వాలీబాల్ నెట్టు కిట్టును సాంబశివరెడ్డి బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు క్రీడాకారులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు శరీరానికి మంచి వ్యాయామాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయని క్రీడలతోనే గెలుపు ధారికి పునాది వేసుకోవచ్చని అన్నారు. స్థానికంగా ఉన్న యువత క్రీడారంగంలో బాగా రాణించి రాష్ట్ర మరియు జాతీయస్థాయిలో గెలిచి పథకాలను సాధించి ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం జానంపేట అకినేపెల్లి మల్లారం వాలీబాల్ ఆట తలపడుతున్న జట్లకి శుభాకాంక్షలు తెలిపి ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్కీ వెంకన్న, లక్కీ ప్రశాంత్ లక్కీ రాజు బొడ్డు ముత్యాలరావు, అకినేపల్లి మల్లారం ఎస్టీ కాలనీ, జానంపేట వాలీబాల్ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !