మన్యం న్యూస్, పినపాక, జనవరి 16
పినపాక మండలంలో దళిత బంధు ద్వారా మంజూరైన యూనిట్లను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పరిశీలించారు.పినపాక మండలం లోని మల్లారం లో సోమవారం జాడి కిరణ్ వస్త్ర దుకాణాన్ని, జానంపేట లో బుడుగుల శ్రీను ఏర్పాటుచేసిన హార్డ్ వేర్ దుకాణాన్ని, దుగునేపల్లి గ్రామ పంచాయతీ లో బోడ ఈశ్వర్, అంపల్లి రవితేజ ఏర్పాటుచేసిన మినీ డైరీ యూనిట్లను ఆయన పరిశీలించారు. వాటితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబందు పథకం లో భాగంగా మొదటి విడత లబ్దిదారులు నిర్వహిస్తున్న పలు దుకాణాలను ఆదివారం ఆయన సందర్శించారు. దళిత బంధు లబ్ధిదారులు నిర్వహిస్తున్న వ్యాపార వివరాలు , పొందుతున్న ఆదాయ, వ్యయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల జీవితాలలో వెలుగులు నింపడం కొరకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ,ఈ పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈడి ఎస్సీ కార్పొరేషన్ ముత్యం , పర్యవేక్షకులు రవి కుమార్ , పిఎసిఎస్ చైర్మన్ రవివర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ,పంచాయతి కార్యదర్శులు అజహర్ , సాయి కృష్ణ, లబ్దిదారులు పాల్గొన్నారు.