UPDATES  

 నేడు బి ఆర్ ఎస్ తొలి కేక

నేడు బి ఆర్ ఎస్ తొలి కేక
పోలీస్ చక్రబంధంలో ఖమ్మం పట్టణం
మన్యం న్యూస్, ఖమ్మం ప్రతినిధి: తెలంగాణలో సాధించిన అద్భుత ప్రగతితో భారతదేశంలోని మిగతా రాష్ట్రాలలో ఇదే తరహా ఫలహాలు దక్కాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బి.ఆర్.ఎస్ జాతీయ పార్టీ ఇటీవలే నెలకొల్పిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బి.ఆర్.ఎస్ పార్టీ తొలి కేక యావత్ భారతదేశానికి ఉద్యమాల గడ్డ ఖమ్మం నుండి వినిపించడానికి సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా మంత్రి హరీష్ రావు తో పాటు బి.ఆర్.ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు తీవ్ర కసరత్తు నిర్వహించారు.కాగా
ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి . కె చంద్రశేఖర్ రావు పర్యటన నేపథ్యంలో 4198 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అడిషనల్ డిజి విజయ కుమార్,
ఐజీపీ షానవాజ్ ఖాసిం,
ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి,
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ వి రంగనాథ్,
డీఐజీ కె రమేష్ నాయుడు, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్,
పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వీనిత్, మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్రపవార్ లతో పాటు
> అడిషనల్ ఎస్పీలు- 10
> ఏసీపీలు – 39
> ఇన్స్పెక్టర్లు CI/RI – 139
> సబ్ ఇన్స్పెక్టర్లు SI/RSI – 409
> ఏఎస్ఐలు/హెడ్ -530 కానిస్టేబుల్లు – 1772
> మహిళా కానిస్టేబుళ్లు- 169
> హోంగార్డులు-1005
> స్పెషల్ పార్టీలు- 120
మొత్తం 4198 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసి ఖమ్మం పట్టణాన్ని పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !