UPDATES  

 మంటగలిసిన మానవత్వం అన్న ను కర్రతో కొట్టి హత్య చేసిన తమ్ముడు.

మన్యం న్యూస్,వాజేడు: మానవత్వం మంట కలిసింది.రాక్షసత్వం రాజ్యమేలుతోంది. రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది. ఒకప్పుడు అన్నాతమ్ముళ్ళు అంటే ఒకరికొకరు ఆప్యాయత, అనురాగాలతో కలిసి ఉండేవారు. ఒకటిగా, సమిష్టిగా మెలిగేవారు. కానీ ఇప్పుడు మనుషుల్లో పెరిగిన స్వార్థం ప్రేమానుబంధాలకు అర్థాన్ని చెరిపేసింది. తమ్ముడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు ఓ అన్న.వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని కొప్పుసురు గ్రామానికి చెందిన రోడ్డచంద్రశేఖర్(49) మధ్యానికి బానిసై అను నిత్యం కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగేవాడు. ప్రతిరోజు లాగే రోడ్డచంద్రశేఖర్ మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి తన తమ్ముడైన రోడ్డ నర్సింగరావును అకారణంగా బూతులు తిడుతుండగా.. క్షణికావేశంలోనర్సింగరావు తన అన్న ను కర్రతో తలపై బలంగా మోదాడు.ఈ క్రమంలో తలకు బలమైన గాయమై రోడ్డచంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ ఘటనపై మృతుని భార్య రోడ్డ పద్మ ఫిర్యాదు మేరకు వాజేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు,.ఈ ఘటనపై వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !