మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 18: ఖమ్మంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఈ భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపిందన్నారు. రానున్న రోజుల్లో ఇదే జోష్ తో ముందుకు సాగుతామన్నారు. సభను విజయవంతం చేసిన ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
