మన్యం న్యూస్,పినపాక:
దేశంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బి.ఆర్.ఎస్ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అటు కేంద్రంలో,మరో మారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు తధ్యం అని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఆయన బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బి.ఆర్.ఎస్ జాతీయ తొలి సమావేశానికి హాజరైన అనంతరం మన్యం న్యూస్ తో ఫోన్ లో మాట్లాడారు. ఖమ్మం సభ విజయవంతం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బి.ఆర్.ఎస్ శ్రేణుల్లో ఈ సభ నూతన ఉత్సాహం తీసుకొచ్చిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్,నాయకులు తొలెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
