UPDATES  

 బ్యాలెట్, కంట్రోల్ యూనిట్ల పరికరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనిదీప్

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 18… భారత ఎన్నికల సంఘం ఈసీఐఎల్ కంపెనీ నుంచి వచ్చిన బ్యాలెట్ కంట్రోల్ యూనిట్ల పరికరాలను బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ అనిదీప్ పరిశీలించారు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ పరికరాలను స్కాన్ చేసి ఈవియం గోదాములో బద్రపరచనున్నట్లు కలెక్టర్ అండ్ జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఈసిఐఎల్ కంపెనీ నుంచి జిల్లాకు మూడు కంటైనర్లులో పంపిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లును పరిశీలించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ఎన్నికల సంఘం 1976 బ్యాలెట్ యూనిట్లు, 1543 కంట్రోల్ యూనిట్లు పంపినట్లు చెప్పారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లును నిశిత పరిశీలన చేసి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల గోదాంలో పతిష్ఠమైన బందోబస్తుతో బద్రపరుస్తున్నట్లు చెప్పారు. పరికరాల వివరాలను ఎన్నికల సంఘ కార్యాలయానికి నివేదిక పంపనున్నట్లు చెప్పారు. అనంతరం గోదాం పరిశీలన రిజిష్టరులో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులు యంఏ రాజు, సిబ్బంది నవీన్, బిజెపి నుంచి రవీందర్, కాంగ్రెస్ నుంచి రాజశేఖర్, బిఎస్పీ నుండి వీరు నాయక్, సిపియం నుంచి భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !