మన్యం న్యూస్, అశ్వాపురం జనవరి 19..
అశ్వాపురం గ్రామపంచాయతీలో రైతు వేదిక వద్ద రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అశ్వాపురం ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గురువారం ప్రారంభించడం జరిగింది. . ఈ కార్యక్రమంలో అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ శారద, వైస్ ఎంపీపీ కంచుగంట్ల వీరభద్రం ఎంపీటీసీ తుళ్లూరి గంగాభవాని,మండల స్పెషల్ ఆఫీసర్ భానోత్ వీరన్న,తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో వరప్రసాద్,మండల మెడికల్ ఆఫీసర్ సంకీర్తన గారు, కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరహరి ,ఎంపీఓ భూక్య శ్రీనివాస్ హెల్త్ సూపర్వైజర్ రాజమ్మ, ఏఎన్ఎంలు, గ్రామపంచాయతీ కార్యదర్శి సగ్గుర్తి కృష్ణ చైతన్య, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
