UPDATES  

 మాల మహనాడు మండలం నూతన కమిటీ ఎన్నిక మండలం అధ్యక్షులు గా మైపా లాలయ్య

మన్యం న్యూస్, మంగపేట.

మండలం లోని మాల మహనాడు నూతన కమిటీ అధ్యక్ష ఎన్నిక జరిగిందని పాత్రికాయ సమావేశం లో ములుగు జిల్లా మాల మహనాడు అధ్యక్షులు రాజమల్ల సుకుమార్ తెలియజేశారు.మండల నూతన అధ్యక్షులు గా తిమ్మంపేట గ్రామానికి చెందిన మైప లాలయ్యను ఎన్నుకున్నారు ఈ సందర్బంగా నూతంగా ఎన్నికైనా లాలయ్య మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా అధ్యక్షులు మాజీ మండల అధ్యక్షులు సంపత్ కు జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితమైన, నిబద్దత తో సంఘం అభివృద్ధి కి ఎల్లపుడు తోడ్పాటు అందిస్తూ,మండలములో అన్ని వేళలా అందరికి సహాయపడతానని అన్నారు.
ఈ కార్యక్రమములొ జిల్లా అధ్యక్షులు సుకుమార్,జిల్లా కార్యదర్శి నిమ్మగడ్డ ప్రవీణ్,మాజీ అధ్యక్షులు తాలుక సంపత్,మండల అధికార ప్రతినిధి మురుకుట్ల నరేందర్,నారా దిలీప్,బేత వెంకటేష్,చెన్నూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !