UPDATES  

 మహిళా హక్కుల కోసం పోరాటం చేయాలి పి ఓ డబ్ల్యు రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

 

మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 19: ఈనెల28 న మహబూబాబాద్ లో జరిగే పి ఓ డబ్ల్యు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రగతిశీల మహా మహిళా సంఘం జనరల్ బాడీ నిర్వహించడం జరిగింది. జిల్లా నాయకురాలు పెద్దగోని ఆదిలక్ష్మి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని,స్త్రీలను వంటింటికే పరిమితం చేసే పురుషాధిక్యత,హిందుత్వ, బ్రాహ్మ నీయ చర్యలకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ లో ఈనెల 28,29లలో జరగనున్న రాష్ట్ర మహాసభలలో ఉద్యమాలకు రూపకల్పన నిర్ణయించబడతాయని ఆమె తెలిపారు. 28న మహిళా ప్రదర్శన, 29న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో మహిళా సంఘం నాయకులు సున్నం భూలక్ష్మి, పొడిమి రాధ, కొమరం భద్రమ్మ, కురసం సుజాత, సువర్ణపాక అనంతలక్ష్మి, పర్సిక రమణ, గజ్జల అలివేలు, బండ్ల మునెమ్మ, సుక్కక్క తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !