UPDATES  

 సింగరేణి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల పై సన్నాహక సమావేశం: ఏరియా జీ ఎం జి.వెంకటేశ్వరరెడ్డి

మన్యం న్యూస్ మణుగూరు, జనవరి 19…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్,జీ.వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన బుధవారం 2023 గణతంత్ర దినోత్సవం వేడుకల నిర్వహణ పై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో సంబంధిత విభాగాల అధికారులతో ఏరియా జీ ఎం జి. వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఎంతో ఆహ్లాకరమైన వాతావరణంలో మనమందరం,మన కుటుంబ సభ్యులతో సహ భద్రాద్రి స్టేడియం నందు ఎంతో ఘనంగా నిర్వహించుకునే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ లోటు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు గాను భద్రాద్రి స్టేడియం గ్రౌండ్ లెవెల్ పనులు సకాలంలో పూర్తి చేయాలి అన్నారు.జాతీయ పతాకావిష్కరణ,ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమముతో పాటు,స్థానిక పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులు ప్రదర్శించే సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించడానికి అధిక సంఖ్యలో సింగరేణియులు వారి కుటుంబ సభ్యులతో హాజరవుతారని,వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది. మణుగూరు ఏరియా సింగరేణియులు వారి కుటుంబ సభ్యులు,పరిసర ప్రాంత ప్రజలు సింగరేణి ఆధ్వర్యంలో పివి కాలనీ భద్రాద్రి స్టేడియం నందు నిర్వహించబడే గణతంత్ర దినోత్సవ వేడుకలలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరారు.ఈ కార్యక్రమంలో ఏజిఎం/ఎస్ఓ టూ జిఎం డి లలిత్ కుమార్, ఏజిఎం కేపియూజి నాగేశ్వర రావు,ఏజిఎం సివిల్ డి వెంకటేశ్వర్లు,ఏజిఎం ఈ&ఎం /ఏ డబ్ల్యూఎస్ ఎం.నర్సిరెడ్డి, డిజిఎం ఐఈడి కే వెంకట్ రావు, డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్, మెడికల్ సూపరిండెంట్ శేషగిరి,సీనియర్ సెక్యూరిటి అధికారి అబ్దుల్ షబ్బీరుద్దీన్, సీనియర్ పర్సనల్ అధికారులు సింగు శ్రీనివాస్,వి రామేశ్వర రావు,పి బి అవినాష్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !