మన్యం న్యూస్ ,బూర్గంపాడు ,జనవరి 19… కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భద్రాచలంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భద్రాచల శాసనసభ్యులు పొదెం వీరయ్య ఆదేశానుసారం గురువారం జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ బూర్గంపాహడ్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులుగా ఎంఏ నయీమ్, బూర్గంపాహాడ్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ పాషా, పట్టణ మైనార్టీ కార్యదర్శిగా షేక్ హుస్సేన్ నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్నిక కాబడిన మైనార్టీ సెల్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలను గౌరవించదగ్గ పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని, మాపై ఉన్న నమ్మకం తో మాకు ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, టౌన్ మైనార్టీ అధ్యక్షులు ఆరిఫ్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బాబాజీ, టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిరేల రవికుమార్, పినపాక నియోజకవర్గం కన్వీనర్ సంతోష్ , కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు,సినియర్ కాంగ్రెస్ నాయకులు బలుసు నాగ సతీష్,సరేళ్ళ వెంకటేష్,మహిళా కాంగ్రెస్ నాయకులు పందాల సరిత,కుమారి తదితరులు పాల్గొన్నారు.
