క్రీడలు యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేది
-యూసుఫ్ కప్ విజేత బూర్గంపహాడ్
-బహుమతి ప్రధానోత్సవం చేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 19: మండల కేంద్రంలో జరుగుతున్న యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ కప్ ఫైనల్ గురువారం మ్యాచ్ హోరా హోరీగా సాగింది. ఫైనల్లో బూర్గంపహాడ్, పాల్వంచ జట్ల తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన శ్రీరామ్ ఎలెవన్ పాల్వంచ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 విక్కెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. 93 పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన మని ఎలెవన్ బూర్గంపహాడ్ జట్టు 14.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది ట్రోఫీ గెలుచుకుంది. బూర్గంపహాడ్ జట్టు లోని బ్యాట్మాన్ ప్రేమ్22 పరుగులు చేసి బౌలింగ్ లో 2 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఈ బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా స్థానిక జడ్పీటీసీ, కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ క్రిడలు అనేవి యువతలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచ నలుమూలలు చాటిచెప్పడానికి దోహదపడతాయని తెలిపారు ఈ టోర్నమెంట్ కూడా 15 సంవత్సరాలుగా నిర్వహించటం హర్షినియమన్నారు. బూర్గంపాడు యువత ఆదర్శప్రాయులన్నారు. తదనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. టోర్నీ స్పాన్సర్ ఐ టి సి టి ఎన్ టి యు సి ప్రెసిడెంట్ కనకమేడల హరిప్రసాద్, బొల్లి రామారావు, క్యాష్ ప్రైజ్ విజేతలకి అందజేయగా, ట్రోఫీ స్పాన్సర్స్ డేగల రాజు యాదవ్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జక్కం సర్వేశ్వరరావు. సొసైటీ డైరెక్టర్ బొల్లు రవి, ప్రధాన కార్యదర్శి రామ్ కోటిరెడ్డి, హై స్కూల్ హెడ్మాస్టర్ జాన్సన్ సర్, లైక్ సార్ పాత్రికేయులు మల్లారెడ్డి ఆర్గనైజింగ్ కమీటీ సోహైల్ పాషా, సర్వేశ్వరావు, గోనెల నాని, భజన సతీష్, అబ్దుల్ సలీమ్, సారధి, సతిపండు, మంద ప్రసాద్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.