మన్యం న్యూస్ చండ్రుగొండ జనవరి 19: మండల కేంద్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం స్థానిక రైతువేదిక లో ఎంపీపీ బానోత్ పార్వతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని పెట్టి నిరుపేదల జీవితాలలో వెలుగుని నింపారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి,వైస్ ఎంపీపీ నరకుళ్ళ సత్యనారాయణ, ఎంపీటీసీ దారా బాబు, ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపీఓ తులసీరామ్,తహసిల్దార్ వర్స రవికుమార్, మండల ప్రత్యేక అధికారి సంజీవరావు, డాక్టర్ తనుజ, ఏఎస్ఐ కృష్ణారావు, సిడిపిఓ నిర్మల జ్యోతి, పంచాయితీ కార్యదర్శి ఉపేందర్, ఉప సర్పంచ్ బాబురావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, నల్లమోతు వెంకటనారాయణ, సురా వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
