UPDATES  

 ఇల్లందు పట్టణ పరిధిలో 4 ఏరియా కేంద్రాల్లో కంటి వెలుగు సేవలు

మన్యం న్యూస్ ఇల్లందు జనవరి19:- రెండో విడత కంటివెలుగు కార్యక్రమం  ఇల్లందు పట్టణ పరిధిలో మొత్తం 4  ఏరియా కేంద్రాలలో, పది మందితో కూడిన 4 టీమ్స్ ఆధ్వర్యంలో సేవలు ప్రారంభం అయ్యాయి .ఒక వార్డు ప్రజలకు కంటి వెలుగు సేవలు అందిన పిదప మరో వార్డు ప్రజలకు సేవలు అందుబాటులోకి రానున్నాయి .7 వ వార్డ్లోని స్త్రీ శక్తి భవన్లో క్యాంపు ను ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కంటి వెలుగు కార్యక్రమం యొక్క లక్ష్యం,చూపు సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు పంచటమే అన్నారు.ప్రజలందరూ కార్పొరేట్ స్థాయికి ఏ మాత్రం తగ్గని కంటి వెలుగు  సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ డివి,ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !