బిజేపి వ్యతిరేక శక్తులతో పనిచేస్తాం …
రాష్ట్రాల హక్కులను గుంజుకుంటున్న కేంద్రం
మతాల మధ్య బిజేపి చిచ్చుపెడుతుంది…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..
మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి 19: దేశంలో బిజేపి వ్యతిరేక శక్తులతో పనిచేస్తామని, మతాల మధ్య చిచ్చుపెడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించాడు. గురువారం చండ్రుగొండలో ఇటీవల చనిపోయిన సిపిఎం సీనియర్ నాయకుడు వంకాలయపాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతుందని, రావాల్సిన నిధులను రాకుండా కొర్రీలు పెడతుందని విమర్శించారు. కమ్యూనిస్టులు బలంగా లేరనే ఆరోపణ సరికాదని, ఓట్లు, సీట్లు మాకు ముఖ్యం కాదని, ప్రజాసమస్యలపై పోరాడమే ఏకైకా ఏజెండా అని స్పష్టం చేశాడు. దేశంలో కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదని బిజేపి విమర్శిస్తుందని అసలు కమ్యూనిస్టులు ఈ దేశంలో లేకపోతే భవిష్యత్ ఏంటని దేశ ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చక్కటి పథకాలు ఉన్నాయని, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల పాటు ఉచిత కరెంటు, ఇలా అనేకం ఉన్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు కొంత వెనుకబడుతున్నాయని, అడే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న దేశాల్లో మౌలిక వసతులు ఉన్నాయన్నారు. అందులో విద్య, వైద్యం ప్రధానమైందన్నారు.దేశంలో ధనిక, పేద లేకుండా చూడాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజారోగ్యంపై కేంద్రం ఎక్కువ నిధులు ఎందుకు కేటాయించటం లేదని ప్రశ్నించాడు. రాష్ట్రాల స్థాయిలో పొత్తులు ముగిశాక, దేశ స్థాయిలో బిజేపిని వ్యతిరేకించే ప్రంట్, లేక ఇతర ప్రత్నామ్నాయ శక్తులను కూడబెడతామన్నారు. 1/70 చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని, ఏజెన్సీ ఏరియాలో నివాసం ఉంటున్న గిరిజనేతరులకు పోజిషన్ సర్టిఫికెట్లతో న్యాయం చేయవచ్చన్నారు.ఏజెన్సీలో జీవించే హక్కు గిరిజనేతరులకు ఉంటుందని, అలా లేదనే హక్కు ఏ ఒక్కరికి లేదన్నారు. ఏజెన్సీలో అన్ని ప్రభుత్వ పథకాల్లో గిరిజన, గిరిజనేతరులకు అవకాశాలు ఇవ్వాలన్నారు. ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభతో మోడిలో వణుకు మొదలైందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా నాయకులు కొండపల్లి శ్రీధర్, అన్నవరపు సత్యనారాయణ, మండల కార్యదర్సి ఐలూరి రాంరెడ్డి, పెద్దిని వేణు, యాసా నరేష్, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.