UPDATES  

 స్వర్గీయ బొలిశెట్టి నరసింహయ్య సేవలు చిరస్మరణీయం…వృద్దులకు ఘన సన్మానం, అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కుటింబీకులు

మన్యం న్యూస్,పినపాక: స్వాతంత్ర్య సమరయోధులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు స్వర్గీయబొలిశెట్టి నరసింహయ్య సేవలు చిరస్మరణీయం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చందా లింగయ్య దొర,పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు పోలేబొయిన వాణి అన్నారు.మండల పరిధిలోని గోపాల్ రావు పేట గ్రామంలో బొలిశెట్టి నరసింహయ్య స్వగృహంలో ఆయన కుటుంబీకులు నరసింహయ్యవ్ 2వ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందినసుమారు 100 మంది వృద్ధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథులు, బొలిశెట్టి కుటుంబ సభ్యులు బొలిశెట్టినరసింహయ్య చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల పినపాక మండల అభివృద్ధికి బొలిశెట్టి నరసింహయ్య ఎనలేని కృషి చేశారని, ఆయన సేవలు మరువలేని అని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కికృషి చేస్తా: బొలిశెట్టి విజయ్ ఆనంద్ భాస్కర్
తన తండ్రి బొలిశెట్టి నరసింహారావు చూపిన మార్గంలో పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని బోలిశెట్టి విజయ్ ఆనంద్ భాస్కర్ అన్నారు. త్వరలో టిపిసిసి అధ్యక్షులు ,మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రలో ముఖ్యభూమిక పోషిస్తానని సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి నరసింహారావు కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, సీనియర్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోలే బోయిన తిరుపతయ్య, ముక్కు వెంకటేశ్వర రెడ్డి, వివిధ మండలాలకు చెందిన వృద్ధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మణుగూరు పట్టణానికి చెందిన ప్రముఖులు గుడిపూడి కోటేశ్వరరావు, తారా ప్రసాద్, గోపాలరావుపేట గ్రామస్తులు, బొలిశెట్టి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !