మన్యం న్యూస్ వాజేడు
మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో వాజేడు, వెంకటాపురం, మండలాల గ్రామ పంచాయితీ అభివృద్ధి కార్యక్రమంలో డి ఆర్ డి ఓ అడిషనల్ కలెక్టర్ నాగ పద్మజ మాట్లాడుతూ.. మండలంలో 18 శాఖలకు సంబంధించిన అధికారుల సహాయ సహకారంతో గ్రామ అభివృద్ధికి సాధించే దిశగా గ్రామ పంచాయతీ సెక్రెటరీ ప్రజలతో మమేకమై గ్రామాలను అభివృద్ధి చేయాలని వారన్నారు. ప్రధానంగా గ్రామ పరిపాలన అధికారులు గ్రామ పంచాయతీ దివితిగా వెలుగులు వెదజల్లాలంటూ, వారు కితాబ్ ఇచ్చారు. డిఎల్పిఓ దేవరాజ్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలో ఉన్న సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కారం చేయాలని అన్నారు. పల్లెలు పచ్చదనం, పరిశుభ్రత, ఫ్రైడే ఫ్రైడే, తడి చెత్త పొడి చెత్త, వంటి కార్యక్రమాలను ప్రజలలో అవగాహన కల్పించి వాటి ప్రయోజనాలను తెలియజేసినట్లయితే తద్వారా గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా మార్పు సాధించవచ్చని అన్నారు. గ్రామాలలో విద్య, ఆరోగ్య, పోషక ఆహార లోపాల గురించి గ్రామ పంచాయతీలో అవగాహన కార్యక్రమాలను గ్రామ సభలను విరివిగా చేపట్టాలనీ ప్రతి కుటుంబంలో విద్య తో అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత మొట్టమొదటిగా పంచాయతీ సెక్రెటరీ తీసుకోవాలని అన్నారు.అంగన్వాడి ఆశ కార్యకర్తలను సన్నద్ధం చేస్తూ ఆరోగ్యం పెంపొందించి శిశు మరణాల రేటుని తగ్గిస్తూ బాలింతలు గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ, వెంకటాపురం ఎంపీడీవో బాబు, వాజేడు, వెంకటాపురం ఎంపీ ఓ శ్రీకాంత్, ఆనంద్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.