UPDATES  

 ఘనంగా రజితోత్సవ వేడుకలు….

మన్యం న్యూస్ అన్నపురెడ్డిపల్లి జనవరి 20 : మండల పరిధిలోని రాజాపురం గ్రామంలో శ్రీ చైతన్య విద్యాలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం పాఠశాల వ్యవస్థాపకులు వజ్రాల పుల్లారెడ్డి దంపతులు, కృష్ణారెడ్డి దంపతులను అధ్యాపక బృందం సన్మానించారు. శ్రీ చైతన్య విద్యాలయం వ్యవస్థాపకులు కూడా అధ్యాపక బృందాన్ని ఘనంగా సన్మానించి, రజితోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవస్థాపకులు పుల్లారెడ్డి మాట్లాడుతూ… ఈ 25 సంవత్సరాల్లో శ్రీ చైతన్య విద్యాలయం నుంచి క్రమశిక్షణ,శ్రద్ధ, పట్టుదలతో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు అందించామని, ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారని, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడ్డారని అన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి, ఫాహిమా, రామయ్య,కరుణ, శిల్ప, అనుపమ, నజీమా, మారేశ్వరరావు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !