UPDATES  

 సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు… షీ టీం సబ్ఇన్స్పెక్టర్ రమాదేవి…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ జనవరి 20 : మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి, పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థుల ప్రవర్తన, సైబర్ నేరాల ఇతర అంశాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉండేటి ఆనంద్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన అవగాహన సదస్సులో షీ టీం సబ్ ఇన్స్పెక్టర్ రమాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సమాజంలో సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలని, క్రమశిక్షణ, శ్రద్ధ, పట్టుదల,ఏకాగ్రత ఉంటూ మంచి అలవాట్లు నేర్చుకోవాలని అన్నారు. పాఠశాలకు రోజు యూనిఫామ్ తో రావాలని, అపరిచిత వ్యక్తులతో దూరంగా ఉండాలని, బాలికలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ,గురించి తెలుసుకోవాలని సూచించారు. విద్యతోనే భవిష్యత్తును మెరుగుపరచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కృష్ణారావు,ఉపాధ్యాయులు మంజుశ్రీ, నరసింహారావు,ఎండి వజిద్, లక్ష్మణ్, శకుంతల, కృష్ణ, షేక్ కైసరి బేగం, షీ టీం సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !