మన్యం న్యూస్ గుండాల, జనవరి 21 …ఆళ్లపల్లి మండలంలో 108 వాహనంలో పనిచేస్తున్న సిబ్బందికి సర్టిఫికెట్లను ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ శనివారం పంపిణీ చేశారు. హైదరాబాదు నుంచి వచ్చిన సిబ్బంది 108 వాహనం లో పనిచేస్తున్న పైలెట్ కూడా అత్యవసర సమయాల్లో ప్రధమ చికిత్స అందించే విధంగా వారిని తయారు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న పైలెట్లకు సర్టిఫికెట్లను అందజేసినట్టు భూమా నాగేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, వాహన పైలట్ సునీల్ తదితరులు పాల్గొన్నారు .
