డ్వాక్రా గ్రూపు రుణాలు రద్దు చేయాలి .
రికవరీ పేరుతో ఆస్తుల జప్తు నిలిపివేయాలి.
సిపిఎం పార్టీ డిమాండ్
సిపిఎం జిల్లా కార్యదర్శి . అన్నవరపు కనకయ్య మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 21… జిల్లాలో డ్వాక్రా గ్రూపు రుణాలు పెండింగ్లో ఉన్నట్లు, వాటి జప్తు కోసం అధికారులు మహిళలను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మంచి కంటి భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి చెందిన మహిళలు ఆర్థిక స్థితులు బాగాలేక డ్వాక్రా రుణాలు కట్టలేక ,అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . కరోనా కాలం అనంతరం దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు అధికమయ్యాయని, ప్రభుత్వాలే ఉపశమానం కలిగిస్తున్న పరిస్థితుల్లో … డ్వాక్రా రుణాలు రద్దు చేసే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక ధరల వల్ల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని, పిల్లల ఫీజులు కట్టలేక తినడానికి తిండి లేక అనేక సమస్యల లోగిళ్లలో జీవనం కొనసాగుతున్న వారికి ఉపశమనం కలిగించేలా చూడాలని అన్నారు.
మరో వైపు రైతులకు రుణాలు లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి, రోజులు గడుస్తున్న కాని, ఎటువంటి రుణమాఫీ చేయకుండా నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని అన్నారు. డ్వాక్రా మహిళలను, రైతులని ఆదుకునె విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెర్పాటి పుల్లయ్య, ఎంబి. నర్సారెడ్డి, బ్రహ్మచారి, మందలపు జ్యోతి, కారం పుల్లయ్య, లిక్కి బాలరాజు, జిల్ల కమిటి సభ్యులు కుంసోత్ ధర్మ, అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీను, నబీ, దొడ్డ రవి, అర్జున్, భూక్య రమేష్, స్వామి, వీర్ల రమెష్ ,గడ్డం శ్రీను, సరియం రాజమ్మ, గంగా, చిరంజీవి, చిలకమ్మ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
