కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఆ పార్టీ ఖమ్మం కార్పొరేటర్లు
మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా అధికార బి.ఆర్.ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం విధితమే. ఖమ్మంలో బి.ఆ.ర్ఎస్ జాతీయ సమావేశం అనంతరం పొంగులేటి పార్టీ మారుతారని, బిజెపిలోకి వెళ్లడం ఖాయం అని విస్తృత ప్రచారం జరిగింది. కానీ పొంగులేటి ఏ నిర్ణయం తీసుకోలేక సందిగ్ధంలో ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. ఆయన బిజెపిలోకి వెళ్లడం ఖాయం అని తెలిసిన నాటి నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొంగులేటి అనుచరులలో అధిక భాగం క్యాంపు కార్యాలయం వెళ్లడం మానేసినట్లు సమాచారం.కాగా ఆయన అనుచరుగణం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో శనివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖమ్మం కార్పొరేషన్ చెందిన కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీనితో ఆయన అనుచరులలో మరో ట్విస్ట్ నెలకొంది. పొంగులేటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
