ప్రజాసమస్యలు తీర్చమంటే దాడులకు బెదిరింపులకు దిగుతారా…
– బిఆర్ఎస్ పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
– రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం
– భారతీయ సర్వసమాజ్ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు
మన్యం న్యూస్ చండ్రుగొండ జనవరి 21:
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని భారతీయ సర్వసమాజ్ మహా సంఘ్ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో ఉన్న అధికారులను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరితే అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు బెదిరింపులకు, దాడులకు, పాల్పడతరా.. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భారతీయ సర్వసమాజ్ మహా సంఘ్ నాయకులు, కార్యకర్తలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే ప్రసక్తే లేదని బిఎస్ఎస్ఎమ్ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు స్పష్టం చేశారు. శనివారం చండ్రుగొండ మండల కేంద్రము లోని లక్ష్య గార్డెన్ లో భారతీయ సర్వసమాజ్ మహా సంఘ్ ఆధ్వర్యంలో చండ్రుగొండ, జూలూరుపాడు, మండలాల అధ్యక్షులు కిన్నెర శేషు,భుఖ్య రవి, ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మద్దిశెట్టి సామేలు పాల్గొని కార్యకర్తను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా గిరిజన ప్రాంతాల్లో కనీస మాలిక వసతులు తీర్చడంలో అధికార బీఆర్ఎస్ పార్టీ విఫలమైందన్నారు. ఇదే విషయాన్ని ప్రజలతో కలిసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇలాంటి తాటాకు చప్పుళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇదే తరహాలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తే తాము కూడా అదే రీతిలో వ్యవహరిస్తామన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో భారతీయ సర్వసమాజ్ మహా సంఘ్ ఆధ్వర్యంలో అభ్యర్థులను పోటీలో నిలబెడుతున్నామన్నారు. అలాగే సర్పంచు, ఎంపీటీసీ, జడ్పిటిసి, సొసైటీ ఎన్నికల్లో సైతం మా అభ్యర్థులను పోటీలో నిలబెడతామన్నారు. భారతీయ సర్వసమాజ్ మహా సంఘ్ ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యల పరిష్కరించడమే తమ కర్తవ్యం అన్నారు. అందులో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టించుకొనుటకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని. 2005 కంటే ముందు నుంచి ఎవరైతే పోడు భూమి సాగు చేసుకుంటున్నారో వారందరికీ అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతుబంధు అయిదు ఎకరాల్లోపు ఉన్న సన్నచిన్న కారు రైతులకే ఇవ్వాలని. గిరిజన హిందూ పూజారులను ప్రభుత్వం గుర్తించి నెలసరి జీతాలు గుడి నిర్మాణానికి నిధులు మౌలిక వసతులు కల్పించాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచారాలు వెంటనే అరికట్టాలని రక్షణ కల్పించాలన్నారు. మీడియా మిత్రులపై దాడులు అక్రమ కేసులు ఆపాలి పక్కా ఇల్లు లేని మీడియా మిత్రులను గుర్తించి పక్క ఇల్లు ఇంటి స్థలం కేటాయించాలి. బాలికల బాలుర హాస్టల్ పై ప్రభుత్వ ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి. ఆహారం మరియు హాస్టల్ మౌలిక వసతుల విషయంలో దర్యాప్తు చేసి విద్యార్థులకు ఇబ్బందులు గురి చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వీటన్నిటిపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో వచ్చే నెల ఐదవ తేదీన అన్ని తహశీల్దార్ కార్యాలయ ముందు గ్రామస్తులతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.