విద్యుత్ శాఖ అంకిత భావాన్ని అభినందిస్తున్న ప్రజలు
మన్యం న్యూస్, పినపాక, జనవరి 21
మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామపంచాయతీలో ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభం విరిగి, ప్రమాదకరంగా ఉందని తెలుసుకున్న ఏఈ కావ్య శనివారం వెంటనే, సిబ్బందిని స్థలానికి పంపి ఒకే ఒక్క రోజులో నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే స్పందించి, నూతన స్తంభ ఏర్పాటు గురించి కాంట్రాక్టర్ తో మాట్లాడి పని పూర్తిచేసిన విద్యుత్ శాఖ ఏ ఈ, సిబ్బందిని ప్రజలు అభినందిస్తున్నారు.
