మన్యం న్యూస్,భద్రాచలం:
భద్రాద్రి రాముడుని శనివారం బిజెపిజాతీయ ప్రధాన కార్యదర్శి మీనన, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, ఉప్పల శారద బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యా నారాయణ, బిజెపికొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారివెంట భద్రాచలం నియోజకవర్గం బిజెపి నాయకురాలు కుంజా సత్యవతి, బిజెపిఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.
