UPDATES  

 వేతనం తీసుకునే చోటే పని చేయాలి

మన్యం న్యూస్, మంగపేట: ఉపాధ్యాయులు వేతనం తీసుకునే చోటే పని చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కమిటీ అధ్యక్షులు పృథ్వి డిమాండ్ చేశారు.
ఎస్ ఎఫ్ ఐ ఆద్వర్యంలో మండల పరిధిలో ని రమణక్కపేట , రాజుపేటలో ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగిందని తెలిపారు . ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలు తమ దృష్టికి రావడం జరిగిందన్నారు.ముఖ్యంగా రమణక్కపేట ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 90 కి పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ ని ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విద్యా బోధన చేయడం జరుగుతుందన్నారు.
రాజుపేట జిల్లా పరిషత్ పాఠశాలో 8నెలలు గడుస్తున్న ఇప్పటి వరకూ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు లేక సిలబస్ పూర్తి కాలేదని, విద్యార్థులు ఎలా ఉత్తీర్ణత సాధిస్తారని ప్రశ్నించారు.ఇప్పటి కైన అదికారులు స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం లో దశల వారి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !