UPDATES  

 ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం

మన్యం న్యూస్, మంగపేట.
బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ , నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీష్ చొరవతో మంజూరు చేయించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం లబ్ధిదారులకుమండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణ అందజేశారు.కొత్తపేట (చేరుపల్లి ) గ్రామానికి చెందిన ముత్తనేని సమతకు రూ. 27 వేలు, ఐయిలబోయిన కమల కు రూ.30 వేలు, బోర్ నర్సాపూర్ గ్రామానికి చెందిన గందార్ల రాధిక కు రూ. 20వేల500 చెక్కులను అందజేశారు.ఈ సందర్బంగా మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిది తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వరం అని , ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొంది ఆర్థికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం పేదల అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైవిద్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు అచ్చ సత్యనారాయణ,నర్ర శ్రీధర్, కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టీమల్ల బాలకృష్ణ మండల నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య, ముగల రమేష్ రంగాని నరేందర్ బట్ట నర్సింహారావు దిడ్డి శ్రీనివాస్ సత్యనారాయణ,మండల యూత్ ఉపాధ్యక్షులు సంకోజు ప్రశాంత్,ఎస్సి సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు దేవెందర్ (దేవ ) మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, వీరాస్వామి కోడం నాగేశ్వరావు ,నర్సిముర్తి,ఏకాంతం ప్రశాంత్ జానపట్ల విష్ణు మూగల రాము తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !