UPDATES  

 వంకాయలపాటి సంస్మరణ సభ జయప్రదం చేయండి ….

 

మన్య న్యూస్ చండ్రుగొండ జనవరి 22 :సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వంకాయలపాటి శ్రీనివాసరావు సంస్కరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఐలూరు రామిరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో రామ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అమరజీవి వంకాయలపాటి శ్రీనివాస రావు సుమారు నాలుగు దశాబ్దాల పాటు బారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)లో పనిచేశారు .ఉమ్మడి కొత్తగూడెం మండల కార్యదర్శిగా, చండ్రు గొండ మండల కార్యదర్శిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైతాంగ ఉద్యమాలలో పోడు భూముల పొరాటాలతో పేద ప్రజలకు భూములు అందే విధంగా కృషి చేశారు. తన తుది శ్వాస విడిచే వరకు పార్టీ ప్రజా ఉద్యమాలలో పనిచేస్తూ 2023 జనవరి 11న అనారోగ్యంతో మరణించారు. వీరి జ్ఞాపకార్థం విప్లవజోహార్లు అర్పిస్తూ 20 23 జనవరి ఉదయం10 గంటలకు స్థూపావిష్కరణ , సంస్కరణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్కరణ సభలో పాల్గొని కామ్రేడ్ వంకాయలపాటి శ్రీనివాస రావు కి నివాళులర్పించడానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులను ప్రజా సంఘాల నాయకులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కాసానిఐలయ్య,జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ,జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, వామపక్ష పార్టీల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !