ఆశ్రమ పాఠశాల విద్యార్థులను విచారణ చేసిన డిడి
మాకేం తెలియదు – ఎస్ఎఫ్ఐ వాళ్లు రమ్మన్నారు
బయ్యారం టు భద్రాద్రి పాఠశాల సమస్యల కోసం పాదయాత్ర
ఎట్టకేలకు అధికారుల చొరవతో తిరిగి పాఠశాలకు చేరిన విద్యార్థులు.
ఎస్ఎఫ్ఐ నాయకుల మీద కేసు నమోదు చేసిన పోలీసులు
మన్యం న్యూస్, పినపాక:
ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల నుండి విద్యార్థినులు పాదయాత్రగా బయలుదేరి భద్రాచలం చేరుకొని ఐటీడీఏ పీవోకు సమస్యలపై వినతి పత్రం అందజేస్తామని, ఎస్ఎఫ్ఐ నాయకులు మొదట్లో తెలియజేశారు.కానీ పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, అధికారులు చొరవతో మణుగూరు మండలం రామానుజవరం నుండి తిరిగి ఆశ్రమ పాఠశాలకు విద్యార్థినులు వచ్చేశారు. విషయం తెలుసుకున్న డిటిడిఓ( డీ డీ) రమాదేవి ఆశ్రమ పాఠశాలకు చేరుకొని, విద్యార్థులను పాదయాత్రకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, మాకు ఏమి తెలియదని, ఎస్ఎఫ్ఐ వాళ్లు రమ్మన్నారని, పాఠశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారని, అన్నారు. పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాబురావు మాటలను సైతం లెక్క చేయకుండా, విద్యార్థులను తీసుకొని బయటికి వెళ్లారని, ఆయన రాతపూర్వకంగా పోలీసు అధికారులకు తెలి