మన్యం న్యూస్, సారపాక :
నవ వధూవరులను స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, రామకొండారెడ్డి దంపతులు ఆశీర్వదించారు. ఆదివారం సారపాక వాస్తవ్యులు కొండవీటి బాలస్వామి, పద్మ దంపతుల ఏకైక పుత్రుడు నవీన్ వివాహ కార్యక్రమానికి బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత రామ కొండారెడ్డి దంపతులు హాజరయ్యారు. నవవధువరులైన కొండవీటి నవీన్, స్రవంతి లను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారితోపాటు గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
