UPDATES  

 అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ రవికుటుంబానికి తోడుగా నిలిచిన 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లు

నేస్తమా నేను మరువము ఎన్నటికీ..
అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ రవికుటుంబానికి తోడుగా నిలిచిన 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లు
జిల్లా ఎస్పీ డా.వినీత్. చేతుల మీదుగా 2,05,000 నగదు అందజేత
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 22.. స్నేహానికన్న మిన్న ఈ లోకాన లేదంటూ.. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని నేర్పించుకున్నారు 2000 సంవత్సరానికి చెందిన బ్యాచ్ కానిస్టేబుళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ గత సంవత్సరం అనారోగ్య కారణాలతో మరణించిన కానిస్టేబుల్ రవి కుటుంబానికి 2000 సంవత్సరం బ్యాచ్ కు చెందిన మిత్రులంతా కలిసి రూ. 2,05,000/-రూపాయలను జమచేసి ఆదివారం జిల్లా ఎస్పీ డా.వినీత్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తమ తోటి కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలిచిన 2000 బ్యాచ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు.పోలీస్ కుటుంబంలో పనిచేస్తూ మరణించిన తమ బ్యాచ్ వారికి అందరికీ ఈ విధంగా ఆర్థికసాయం అందజేయడం ఆదర్శనీయమని అన్నారు.పోలీస్ శాఖ తరపున ఆ కుటుంబానికి అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను కూడా వీలయినంత త్వరితగతిన అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. నిత్యం విధులలోనియజ్ఞమై ఉండే పోలీస్ అధికారులు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 2000 బ్యాచ్ నకు చెందిన అజయ్, చందూలాల్,ముత్తయ్య, గరిడేపల్లీ రవి,మంగీలాల్,రవి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !