మన్యం న్యూస్,పినపాక:
మండల పరిధికి తోగ్గుడెం గ్రామానికి చెందిన ఓర్సు రాజమ్మ (56) అనారోగ్యంతో మృతిచెందింది. ఈ విషయం తెలుసుకొని విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం ఓర్సు రాజమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్,మండల ఉపాధ్యక్షులు కటకం గణేష్ తదితరులు పాల్గొన్నారు.
