మతోన్మాద దాడులను అరికట్టండి
*న్యాయ వ్యవస్థను ప్రక్కదారి పట్టించడం శోచనీయం
*మతోన్మాదులు చేస్తున్న మూకదాడులను ప్రభుత్వం అరికట్టాలి
*స్వేచ్ఛ జే ఏ సీ
మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం నగరంలో జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వేచ్ఛ జే ఏ సి ఆధ్వర్యంలో సోమవారం మానవహారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా స్వేచ్ఛ జేఏసీ రాష్ట్ర నాయకులు నామాల ఆజాద్, పి.నాగిరెడ్డి , సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అభ్యుదయవాదులు, టీచర్లు, అంబేద్కర్ వాదులు, హేతువాదులు, భౌతిక వాదులు, నాస్తికులపై మతోన్మాదులు చేస్తున్న మూకదాడులు ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు.
కోటగిరి మండల కేంద్రంలో ఉపాధ్యాయులు మల్లికార్జున్ పై దాడి చేసిన దుండగులను చట్ట ప్రకారం శిక్షించకుండా వారందరినీ అరెస్ట్ చేయకపోవడం, అరెస్ట్ చేసిన వారికి సైతం బెయిల్ మంజూరు చేసి ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టన్ని నిరుగార్చడం దుర్మార్గం అన్నారు. సంఘ్ పరివార్ శక్తులు చట్టాన్ని చేతిలోకి తీసుకోని, న్యాయ వ్యవస్థను ప్రక్కదారి పట్టించడం శోచనీయం అన్నారు. ప్రభుత్వం న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా నడిచేలా కృషీ చేయాలన్నారు. రాష్ట్రంలో మాట్లాడే అవకాశం లేకుండా, ప్రశ్నించేతత్వాన్ని కలారాయడం ఎంత వరకు సమంజసం అన్నారు. విద్యాలయాల్లో శాస్ర్తీయ విద్య బోధన జరపకుండా అడ్డుకోవడం, విద్యాలయాల్లో, హింస రెచ్చగొట్టే చర్యలను తక్షణమే అరికట్టాలని వారు కోరారు. లేనిపక్షంలో స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు మేకల.శ్రీనివాస్, కేవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎన్.మనోహర్, పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి ఝాన్సీ, టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి మస్తాన్, పిడీఎస్
యూ జిల్లా కార్యదర్శి వి.వెంకటేష్,పి వై ఎల్ జిల్లా కార్యదర్శి రాకేష్, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు రమేష్ స్పిరిట్ ఆఫ్ మాల జిల్లా కార్యదర్శి కనకరాజు, సీపీఐ నగర నాయకులు జితేందర్ , పి. వై. ఎల్ జిల్లా కార్యదర్శి లక్ష్మినారాయణ, పి. వై. ఎల్ నగర కార్యదర్శి చందు, పి.డీ. ఎస్.యూ ఖమ్మం జిల్లా నాయకులు సాగర్, ఆర్కె, పి వై ఎల్ జిల్లా నాయకులు ఉమా శంకర్,
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ టౌన్ సెక్రెటరీ పాముల మోహన్ రావు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.