మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 23, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల పరిధిలోని గుండెపుడి గ్రామానికి చెందిన కాళ్ళూరి రాజ్ కుమార్ (ఏబీఎన్ రాజు) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. రాజ్ కుమార్ కొత్తగూడెం ఏబీఎన్ ఛానల్ రిపోర్టర్ గా అందరికీ సుపరిచితులు. ఏబీఎన్ రాజు అకాల మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు రాజు స్వగ్రామమైన గుండెపుడికి చేరుకొని రాజు పార్థివ దేహానికి పూలమాల లేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా, టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి షఫీ, స్థానిక ఎంపీపీ సోనీ, మండల పార్టీ అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ కుమార్, సీనియర్ నాయకులు లాకావత్ గిరిబాబు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగీలాల్, స్థానిక ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.