UPDATES  

 విద్యుత్ ఎడిసి చార్జీలు రద్దు చేయాలి – సమాచారం ఇవ్వకుండా అధిక భారం మోపుతున్నారు – సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు

విద్యుత్ ఎడిసి చార్జీలు రద్దు చేయాలి
– సమాచారం ఇవ్వకుండా అధిక భారం మోపుతున్నారు
– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు

మన్యం న్యూస్, భద్రాచలం :

వినియోగదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారిపై అధిక భారం మోపుతున్న ఏసిడి చార్జీలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ శాఖ ఏఈకి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ… విద్యుత్ శాఖ గత సంవత్సరం అధికలోడు పేరుతో వేల రూపాయలు వసూలు చేసిందని, మళ్లీ ఈ సంవత్సరం అడిషనల్ కన్స్యూమర్ డెవలప్మెంట్ చార్జెస్ (ఏ డి సి ) పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపడం సరికాదని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి ఇస్తున్న మితిమీరిన స్వేచ్ఛ ఫలితంగా వినియోగదారుల పై భారాలు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారులకు వాడుక బిల్లు కంటే ఏసీడీ బిల్లు మూడు రెట్లు అదనంగా వస్తుందని ఇది ఏ పద్ధతిలో వస్తువుల్లో చేస్తున్నారో కూడా వినియోగదారులకు వినియోగదారులకు సమాచారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే విద్యుత్ వినియోగదారులపై ఏడిసి పేరుతో వేస్తున్న అదనపు భారాన్ని రద్దు చేయాలని, విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంపీ నర్సారెడ్డి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, సున్నం గంగ, కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్ రెడ్డి, బండారు శరత్ బాబు, పి సంతోష్ కుమార్, ఎన్.లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు, డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !