UPDATES  

 హాస్టల్ వర్కర్ల భిక్షాటన

మన్యం న్యూస్,భద్రాచలం:
బకాయి వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనవరి 3వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న గిరిజన హాస్టల్ ఔట్సోర్సింగ్ కార్మికులు సోమవారం భద్రాచలం పట్టణంలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి మాట్లాడుతూ గిరిజన కార్మికులకు రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా ఎట్టి చాకిరీ చేయించుకుంటుందని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు పస్తులతో ఉంటుంటే ముఖ్యమంత్రి మంత్రులకు పట్టదా అని ప్రశ్నించారు .ఇప్పటికే అనేకసార్లు మంత్రులకు ,ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు కార్మికులు తమ గోడును వెల్లబోసుకున్నారని, అయినప్పటికీ వారి నుండి ఎటువంటి స్పందన లేదన్నారు. ఈ కారణంగానే జనవరి 3 నుండి సమ్మెకు దిగాల్సి వచ్చిందని సిఐటియు పేర్కొన్నది. గిరిజన కార్మికుల చేస్తున్న ఆకలి పోరాటానికి భద్రాచలం పట్టణ ప్రజలు అండగా ఉండాలని వారి పోరాటానికి ఆర్థిక సహాయాన్ని అందించి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించి సమ్మెను పరిష్కారం చేయాలని లేదంటే ప్రజలు ప్రజాసంఘాల సహకారంతో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సిఐటియు భద్రాచలం పట్టణ నాయకులు నకిరికంటి నాగరాజు, జి లక్ష్మీకాంత్, హాస్టల్ వర్కర్ల యూనియన్ నాయకులు లక్ష్మి, శ్రీను ,రాములు ,భద్రమ్మ, నాగమణి, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !