మన్యం న్యూస్, భద్రాచలం :
రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ని హైదరాబాదులో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గం ప్రజల సమస్యలను మంత్రికి వివరించారు. భద్రాచలంలో సెంట్ర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్లు, భద్రాచలం పట్టణంలోని మార్కెట్ నిర్మాణం తదితర ప్రజల సమస్యలను, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి హరీష్ రావుకు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అందజేశారు.