UPDATES  

 అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రేగా కాంతారావు

అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రేగా కాంతారావు
* ప్రధాన రహదారి మరమ్మత్తుపనులను పరిశీలించిన మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి
మన్యం న్యూస్, అశ్వాపురం: అశ్వాపురం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్నాడని మొండి కుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అన్నారు. అశ్వాపురం మండలం మొండికుంట ప్రధాన రహదారి మణుగూరు టు కొత్తగూడెం వెళ్ళు ప్రధాన రహదారి నిర్మాణ మరమ్మత్తు పనులను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరంలో వచ్చినటువంటి అధిక వర్షపాతాన్ని ప్రధాన రహదారి పూర్తిగా ద్వంసం కావటం తో ఇట్టి సమస్యను పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి రూ. 28 లక్షలు మంజూరు చేయడమే గాక సకాలంలో ప్రధాన రహదారి మరమ్మత్తులు నిర్వహణకు కృషిచేసిన ఎమ్మెల్యే రేగాకు మొండి కుంట గ్రామ పంచాయితీ పాలక వర్గం తరపున,గ్రామ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శివారపు డాక్టర్ బాబు, సోమ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !