UPDATES  

 మణుగూరు ఏరియా ఉత్తమ ఉద్యోగుల ఎంపిక….

మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 24 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా ఉత్తమ అధికారులు, ఉత్తమ సింగరేణియన్, ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసినట్లు ఏరియా అధికార ప్రతినిధి సలగల రమేష్ మంగళవారం తెలిపారు. ఉత్తమ అధికారిగ పీకే ఓ సి-4 లో అడిషనల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న దేవసాని శ్రీనివాసరావు, ఉత్తమ సింగరేణియన్ గా పీకే ఓసి-2 ఈపీ ఆపరేటర్ ససేంద్ర కురూప్ లను ఎంపిక చేశామన్నారు. వీరితోపాటు ఉత్తమ ఉద్యోగులుగా బోనగిరి నాగేశ్వరరావు, కే శ్రీనివాసరావు, పూజారి శ్రీనివాసరావు, కృష్ణ కుమార్ కళ్యాణం, మహబూబ్ షేక్, ఆంజనేయులు, ఎం శ్రీనివాసరావు, జర్పుల చంద్రులను ఎంపిక చేయడం జరిగింది అన్నారు. ఉత్తమ ఉద్యోగులను ఈనెల 26న మణుగూరు ఏరియా పి వి కాలనీ భద్రాద్రి స్టేడియం నందు నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏరియా జిఎం వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా సత్కరించి ప్రశంసా పత్రాలు బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. ఉత్తమ సింగరేణియన్, ఉత్తమ అధికారి అవార్డు గ్రహీతలకు కొత్తగూడెంలో జరిగే ప్రధాన వేడుకల్లో సింగరేణి సీఅండ్ఎండి శ్రీధర్ చేతుల మీదుగా సత్కారం నిర్వహించి ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !