UPDATES  

 బాలికలు అన్ని రంగాలలో ముందుండాలి.. విద్యతోనే భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. మండల విద్యాశాఖధికారి సత్యనారాయణ..

  • బాలికలు అన్ని రంగాలలో ముందుండాలి..
  • విద్యతోనే భవిష్యత్తును నిర్ణయించుకోవాలి.
  • మండల విద్యాశాఖధికారి సత్యనారాయణ..

మన్యం న్యూస్ చండ్రుగొండ డిసెంబర్ 24 : బాలికలు విద్యతోనే భవిష్యత్తును నిర్ణయించుకోవాలని, విద్యతోనే అత్యున్నత స్థానాలకు చేరుకుంటారని మండల విద్యాశాఖధికారి సత్యనారాయణ అన్నారు. మంగళవారం కస్తూర్బాగాంధీ బాలికల వసతి గృహంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు బాలికల ఆత్మరక్షణ కొరకు ప్రత్యేకధికారి శాంతకుమారి ఆధ్వర్యంలో ఎంఈఓ కరాటే శిక్షణ తరగతులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే అన్ని రంగాల్లో ముందుండాలని,శారీరకంగా దృఢంగా ఉండాలని,బాల్యవివాహాలు నిర్మూలించాలని, బాల్య వివాహాలు చేయడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయని అవి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. సమాజంలో జరుగుతున్న అకృత్యాలు గమనిస్తూ దూరంగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కృష్ణారావు, కరాటే శిక్షకుడు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !